ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దోమలు వలన మలేరియా వ్యాధి, లక్షణాలు మరియు చికిత్స


దోమలు వలన మలేరియా వ్యాధి, లక్షణాలు మరియు చికిత్స 

మలేరియా పుట్టుక

మలేరియా, దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. పరాన్నజీవులు తమ ఆహారం కోసం తాము నివసిస్తున్న మనుషులు పైనే ఆధార పడతాయి. మలేరియా ఏ విధంగా వస్తుందో కనిపెట్టింది గాను ఫ్రెంచ్ రక్షణ వైద్యం చార్లెస్ లో ఆల్ ఫ్రెండ్స్ కు 1907లో నోబెల్ బహుమతి లభించింది. మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రం, అది దోమలలో మనుషులలో ఎలా నడుస్తుందో తెలిపినందుకు 1902లో రొనాల్డ్ రాస్ కు నోబెల్ బహుమతి లభించింది. సర్ రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నాడు. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడిన వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ప్రోటోజోవాలు ఏకకణజీవులు కానీ వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది బ్యాక్టీరియా చాలా సులువైన నిర్మాణం కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్మోడియం స్పేస్ ఇల్లు మనుషులలో 

వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి అందులో ముఖ్యమైనవి

  • ప్లాస్మోడియం పాలసీ ఫారం
  • ప్లాస్మోడియం వైవాక్స్ప్లా
  • స్మోడియం మలేరియా
  • ప్లాస్మోడియం వోవెల్ 
  • ప్లాస్మోడియం సెమీ ఓవెల్ప్లా
  • స్మోడియం నో వెస్లీ
పై వాటిలో వైవాక్స్ వాల్పేపర్ ఎక్కువ మంది ప్రజలకు సోకుతుంది పాలసీ ప్రకారం మలేరియా అన్నింటికంటే ప్రాణాంతకమైనది.

మలేరియా చరిత్ర


5000 సంవత్సరాల క్రితం నుండే మలేరియా మానవజాతిని పట్టి పీడిస్తున్నది. క్రీస్తు పూర్వం 2700 మొదలుకుని చైనాలో చాలాసార్లు మలేరియాలాంటి జ్వరాలు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. మలేరియా అనే పేరు "మల అరియ" అనే ఇటాలియను పదాల నుండి పుట్టింది. "మల అరియ" అంటే చెడిపోయిన గాలి అని అర్ధం. చిత్తడి నేల ఉన్న చోట్ల మలేరియా అధికంగా ఉండటం వలన ఈ జ్వరాన్ని marsh fever (చిత్తడి జ్వరం) అని కూడా పిలిచేవారు.

1880లో ఫ్రెంచి సైన్యంలో వైద్యుడైన చార్లెస్ లూయీ ఆల్ఫోన్సె లావెరెన్ అల్జీరియాలో పనిచేస్తున్నప్పుడు ఎర్రరక్తకణాలలో ఈ పరాన్న జీవులను కనుగొన్నాడు. ఈ పరాన్న జీవులే మలేరియా కారకాలని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పాడు. దీని వలన, తరువాత కనుక్కున్న ఇంకొన్ని విశేషాల వలన ఈతనికి 1907లో నోబెల్ బహుమతి లభించింది. ఆల్ఫోన్సె కనుక్కున్న ఈ పరాన్న జీవికి ప్లాస్మోడియం అనే పేరును ఎట్టోర్ మర్చియఫవా, ఎంజెల్లో చెల్లి అనే ఇద్దరు ఇటలీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇది జరిగిన తరువాత సంవత్సరానికి, కార్లోస్ ఫిన్లే, అనే క్యూబా డాక్టరు ఈ పరాన్న జీవులు దోమల ద్వారా వ్యాపిస్తాయని ప్రతిపాదించాడు. 1898లో సర్ రొనాల్డ్ రాస్ భారతదేశంలో పరిశోధన చేస్తున్నప్పుడు దానిని నిరూపించాడు. అందుకు గాను రొనాల్డ్ రాస్‌కు 1902లో నోబెల్ బహుమతి లభించింది. 

మలేరియా ఎలా సోకుతుంది


మలేరియా వైరస్ వ్యాప్తి సాధారణంగా దోమకాటు వలన జరుగుతుంది. తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడం కోసం మలేరియా పరాన్నజీవి మనుషులు అవసరం. మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది లాలాజలంలో స్పోర్ట్ జాయిస్ ఉంటాయి. అవి మీ రోజా హిట్స్ గా కాలేయము ఎర్రరక్త కణాల్లో పరిణితి చెందుతాయి ఇలా పరిణితి చెందిన మీ రోజా హిట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అన్ని దోమలూ మలేరియాను వ్యాప్తి చేయవు కేవలం అనోపిస్ అని జాతిలోని ఆడ దోమల వల్ల మాత్రమే మనుషులకు వ్యాధి సోకుతుంది.
ఇతర మార్గాల ద్వారా కూడా ఈ వ్యాధి సోకవచ్చు గర్భంలో ఉన్న శిశువుకు తల్లినుండి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వలన లేదా వ్యాధిగ్రస్తులకు వాడిన సిరంజిని వాడడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

ఈ పరాన్నజీవులు మనుషులలో ఎలా బతుకుతాయి: మనుషుల్లో కు వచ్చిన ప్లాస్మోడియంని స్పోర్ట్ రోజుడ్స్ అని పిలుస్తారు. మనుషులకు ప్రవేశించిన వెంటనే ఈ కాలంలో కి వెళ్లి అక్కడ తమ సంతతిని వృద్ధి పరుచుకుంటాయి. అప్పుడే అవి మే రోజు ఫైట్స్ నీ సృష్టిస్తాయి. వాటి సంతతి అలా పెరిగిపోయి ఎర్ర రక్త కణాలు ఏ మాత్రంఇమడ లేక వాటిని బద్దలు చేసుకుని బయటికి వచ్చేస్తాయి సరిగ్గా ఈ దశలోనే వ్యాధిసోకిన మనిషి బాగా నీరసంగా కనిపిస్తాడు జ్వరం కూడా వస్తుంది ఇలా కొన్ని రోజులపాటు జరుగుతూ ఉంటుంది దీనిని పరోసిసం అంటారు. అనగా హఠాత్తుగా జరిగే దాడి.


అయితే పైన చెప్పిన ప్లాస్మోడియం లో ప వివక్స్ వివెల్ కాలేయం లో ఎక్కువ సేపు 
ఉంటాయి. అవి కాలేయంలో  ఉన్నంత సేపు మనిషి బాగానే కనిపిస్తాడు కానీ లోపల అవి వాటి సంతతిన వృద్ధి చేసుకుంటాయి.దీనిని నిద్రాణ దశ అని అనుకోవచ్చు కొన్ని వారాలు లేదా నెలల తరువాత ప్లాస్మోడియం కాలేయం నుండి మెల్లగా ప్రవేశిస్తుంది ఈ సమయంలో జ్వరం లక్షణాలు కనిపిస్తాయి.

మలేరియా లోని మూడు రకాల దశలు


  • చల్లని దశ - జ్వరం ప్రారంభదశలో చిహ్నం ఇది జ్వరం యొక్క ప్రాథమిక భావన.
  • దాడి దశ - ఈ దశలో రోగి చాలా వెచ్చగా ఉన్నట్టుండి దగ్గరదగ్గరగా 40 డిగ్రీల వరకు జ్వరం కలిగివుంటాడు.
  • చెమట దశ- ఈ దశలో రోగి వెచ్చదనం తగ్గుతున్నట్లు ఉండి జ్వరం 40 డిగ్రీల నుండి క్రమంగా తగ్గి శరీరం నుండి చెమట ప్రారంభం అవుతుంది. రోగికి జ్వరం తగ్గిందా అవుతాడు 
ఈ మూడు దశలు మలేరియా ఒక రకాన్ని బట్టి 24 నుండి 48 లేదా 72 గంటల వ్యవధిలో పునరావృతం అవుతాయి మలేరియా పరాన్నజీవి యొక్క తదుపరి జీవితం చక్రంలో భాగంగా ఎర్రరక్తకణాలు విడుదల లేదా పగులుట వలన రోగికి జ్వరం ఎక్కువ అవుతుంది.


మలేరియా ఏఏ ప్రాంతాల్లో వ్యాప్తి ఉంది


గర్భవతులు చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది మలేరియా పీడిత ప్రాంతాలలో నివసిస్తున్నారు మలేరియా పీడిత ప్రాంతాలు
  • ఆఫ్రికా
  • ఆసియా
  • మధ్య , దక్షిణ అమెరికా
  • తూర్పు యూరప్ 
  • దక్షిణ పసిఫిక్ ప్రాంతాలు
ప్రతి సంవత్సరం 30,00,00,000 నుండి 50,00,00,000 మంది వరకు మలేరియా బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం 10,00,000 నుండి 20,00,000 వరకు ప్రజలు మలేరియా వలన మరణిస్తున్నారు. చనిపోతున్న వారిలో 90 శాతం మంది ఆఫ్రికా వారే అందులో సింహభాగం చిన్నారులే ఆఫ్రికాలో 20 శాతం మంది పిల్లలు మలేరియా వలన 5 ఏళ లోపే చనిపోతున్నారు. ఒకవేళ చనిపోక పోగా బతికి ఉన్నా వారి మెదడు దెబ్బతిని ఇతరుల మాదిరిగా తెలివితేటలతో ఉండలేరు. ఈ మరణాలను ఆపవచ్చు మలేరియాను మందులు వలన కానీ లేదా దోమల వ్యాప్తిని అడ్డుకోవడం వల్ల అరికట్టవచ్చు యూనిసెఫ్ ప్రకారం తొలగించడానికి కావలసిన మందులు ఖర్చు కేవలం వంద రూపాయలు మలేరియా ఎక్కువ దేశాలలో ప్రజలకు వారి వద్ద కానీ ఆ దేశ ప్రభుత్వం వద్ద గాని స్తోమత లేదు.

భారతదేశంలో మలేరియా 


భారతదేశంలో ఏటా మలేరియాతో లక్షల మంది మరణిస్తున్నారు చాలా ప్రాంతాల్లో మలేరియా వ్యాధి ప్రబలంగా ఉంది ప్రతి ఐదు నుండి ఏడు సంవత్సరాలు పరిధిలో ఈ వ్యాధి ప్రబలి ఎక్కువ మందికి సోకుతూ ఉన్నది. 1990 -93 మధ్యకాలంలోదీని వలన 500 నుండి 600 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా వేయబడింది 1977-97 ఈ మధ్యకాలంలో దేశంలో మొత్తం ఆరోగ్య రంగం బడ్జెట్లో దాదాపు 25 శాతం వరకు మలేరియా నివారణ నిమిత్తం ఖర్చు చేయబడింది 1997 ఇది మరింతగా పెంచారు సంవత్సరానికి 60 మిలియన్ డాలర్ల వరకు మలేరియా నివారణ నిమిత్తం ఖర్చు చేయ సాగారు ఇందులో 70 నుండి 80 శాతం వరకు క్రిమిసంహారక మందుల ఖర్చు అవుతున్నది.

1964 నుండి మలేరియా అదుపు చేయడానికి డి.డి.టి వినియోగం మొదలైంది 1953 లో ఏడు కోట్ల పైగా ప్రజలు మలేరియా బారిన పడ్డారు. 8 లక్షల వరకు మరణాలు అందువలన సంభవించాయి అప్పుడు 1958లో జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం మొదలైంది. డి డి టి జల్లడం పని చేయడం ద్వారా పదేళ్లలో ఈ వ్యాధిని విడిచిపెట్టడం సాధ్యమైందని అనుకున్నారు కానీ 1965లో ఈ వ్యాధి మరల విజృంభించింది. మలేరియా క్రిములు డిడిటి మందుకు నిరోధకశక్తి ఏర్పరచుకోవడం మే ఇందుకు ముఖ్యమైన కారణంగా భావిస్తున్నారు.తరువాత చర్యలు మార్చి తీవ్రమైన కొన్ని క్రిములను అరికట్టే చర్యను ప్రారంభించారు ఇది కొంత వరకు వచ్చింది కానీ మళ్లీ 1994లో పెద్ద ఎత్తున మలేరియా కేసులు నమోదయ్యాయి జాతీయ మలేరియా పరిశోధనా సంస్థ ప్రయత్నంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నాయి.

మలేరియాను ఈ విధంగా గుర్తించండి


మలేరియా సోకిన 10 నుండి 30 రోజులలో జ్వరం రావచ్చు ఆ తర్వాత ఇంకో వారం రోజుల్లో గానీ వ్యాధి లక్షణాలు కనిపించవు కొంత మందికి మలేరియా సోకిన వ్యాధి లక్షణాలు కనిపించవు ఎక్కువ మందికి 10 నుండి 30 రోజులలో జ్వరం వస్తుంది.మలేరియా సోకినప్పుడు జ్వరం హటాత్తుగా వస్తుంది జలుబు చేసిందేమో అన్నట్టు అపోహ కలుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. 

మలేరియా లక్షణాలు


కీళ్ల నొప్పులు ,తలనొప్పి, వాంతులు, ఓపిక లేకపోవడం, రక్తహీనత ,చర్మం పచ్చగా మారడం, దగ్గు, కాలేయం పెరగటం, అతిగా చెమట పట్టడం, అతిగా చలి పుట్టడం, కోమాలోకి వెళ్ళిపోవడం, గుండె కొట్టుకునే వేగంగా  ఉండడం 

మలేరియా చికిత్సా విధానం 


వ్యాధిగ్రస్తుని సో కిన మలేరియా ఏ రోగమో తెలుసుకొని దానికి తగ్గట్లుగా మందులు ఇవ్వగలం. ఒక రకం ప్లాస్మోడియంకి పనిచేసిన మందు వేరే దానికి పనిచేయకపోవచ్చు ఒకవేళ ఏ రకమైన మలేరియాను తెలిసినప్పుడు పల్స్ ఫారం మలేరియా అనే అనుకోవాలి ఎందుకంటే అది అన్నింటి కంటే భయంకరమైన మలేరియా కాబట్టి అప్పుడు వ్యాధిగ్రస్తుని మలేరియా వ్యాధి ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా మారుతుంది ఆఫ్రికాలో ఇచ్చే ముందు అమెరికాలో ఇచ్చే మందు  వేరుగా ఉంటాయి. డాక్టర్లు ఎప్పటికప్పుడు తమ ప్రాంతంలో ఏ విధంగా ఉందో పరిశీలిస్తూ ఉండాలి కొన్ని సార్లు ఆయా ప్రాంత ప్రజానీకం మలేరియా మందులకు అలవాటు కాబట్టి డాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకొని చికిత్స చేయవలెను.

మలేరియాను ఎలా నివారించాలి, సవరించి పద్ధతులు


మలేరియాకు అన్నింటి కంటే మంచి చికిత్స అది రాకుండా నివారించడమే. మలేరియాను మూడు రకాలుగానూ నివారించవచ్చు. దోమలను అదుపుచేయడం మిమ్మల్ని కుట్టకుండా చూసుకోవడం. దోమకాటుకు గురయితే సరయిన మందులు తీసుకోవడం దోమలను అదుపుచేయడం సవరించి దోమలను అదుపుచేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఇది కూడా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దోమలను అరికట్టడానికి dichloro dichloroethane అనే క్రిమి సంహారక మందును వాడేవారు ఇది చాలా తక్కువ ధరలో లభిస్తు బాగానే పనిచేస్తుంది కూడా పెద్దగా అపాయం కాదు కానీ ఇది పర్యావరణంలో ఎక్కువ సేపు ఉండి కాలుష్యాన్ని పెంచి తద్వారా దీర్ఘకాలంలో కీడు చేస్తుంది అనుకున్నారు కానీ ఈ వాదన మలేరియా ధనిక దేశాలలో మాత్రమే వినిపిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అని చెబుతుంది ఎందుకంటే ప్రతి నిమిషానికి ఇద్దరు చిన్నారులు మలేరియా వలన మరణిస్తున్నారు. దీని ముందు డి డి టీ చేసే పని చాలా తక్కువ కానీ వచ్చిన చిక్కల్లా కొన్ని ప్రాంతాల్లో దోమలు ఈ డిడిటిని తట్టుకునే సామర్థ్యం పెంచేసుకున్నాయి . ఈ క్రింది ప్రాంతాలలో డి.డి.టి తో దోమలను అరికట్టడం చాలా కష్టమైపోయింది.


  • భారత దేశము
  • శ్రీలంక
  • పాకిస్తాన్ ఆన్ 
  • టర్కీ 
  • మధ్య అమెరికా
ఈ ప్రాంతాల్లో వేరే మందులు వాడాలి కానీ అవి ఖరీదైనవి అవి ఆర్గానో ఫాస్ఫేట్ లేదా మొదలైన క్రిమిసంహారక మందులు

దోమలు కుట్టకుండా చూసుకోవడం సవరించు మలేరియాను మూసుకుని ఉన్నప్పుడు లేదా చీకటి పడుతున్నప్పుడు వస్తాయి ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది దోమలను తరిమి వేసేందుకు ఉపయోగపడే పొడుగు చేతుల చొక్కాలు ధరించి కూడా వాడొచ్చు. 

మలేరియా వ్యాధి చికిత్స



రోగికి విశ్రాంతి ఇవ్వాలి. రోగికి కాచి చల్లార్చిన నీరు బాగా తాగడానికి ఇవ్వాలి. ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదు. మంచి మందులు వాడాలి. వీలైనంత గుండె దైర్యం కలిగి వుండాలి.

జ్వరం నందు ఉపయోగించు ద్రవ్యాలు



  • ఉసిరి, కరక్కాయ, తానికాయ, తిప్పతీగ , వాసా కషాయం కాచుకుని 20 లేదా 30 మిల్లీలీటర్ సేవించిన జ్వరం తగ్గుతుంది. సుదర్శన ఘనవటి 500 మిల్లీగ్రాముల పిల్లలు పూటకు రెండు చొప్పున వాడాలి. 
  • శొంఠి, కిరాతిఎక్త, త్రిఫల, గూడుచి, ఆమలకి, మస్తా, తులసి మొదలగు వానిని సమభాగాలుగా తీసుకొని కషాయం కాచి సేవించిన మలేరియాలో ఉపయుక్తం గా ఉండును. 
  • గూడూచి కషాయం మూడు మిల్లీ లీటర్లు సాయంత్రం సేవించిన విషజ్వరం లో ఉపయుక్తంగా ఉంటుంది రక్త చందన గూడూరు సొంటి సమాన భాగాలుగా గ్రహించిన కషాయం కాచి 20 లేదా 30 మిల్లీలీటర్ల రోజుకు మూడు సార్లు చేయించిన విషజ్వరం హరిస్తుంది. 
  • పాలు, రొట్టె, పండ్ల రసాలు, మెత్తగా గుజ్జులా చేసినా ఆహారపు ఓటు, కిచిడీ మొదలగునవి ఇవ్వవచ్చును, తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. 

జాగ్రత్తలు 


మలేరియా సోకకుండా జాగ్రత్తగా వుండాలి. దోమల కుట్టకుండా జగట్ట పడాలి. వాటికి తగిన మాస్క్ లు, దోమ తెరలు వాడాలి. జ్వరం, వహహినట్టు అనిపిస్తే హాస్పిటల్ కి వెళ్లి సంప్రదించాలి 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్