ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పర్యావరణం కాలుష్యం-భూమి, నీరు, గాలి.

పర్యావరణం మరియు కాలుష్య కారణాలు 

కళ్ళు చెదిరే ప్రకృతి సోయగాలతో, పచ్చటి శోభ లను సంతరించు కుంటు, ప్రకృతి అందాలతో  మనల్ని మనం మర్చిపోయేలా చేసి తన్మయత్వంలో ముంచి తేల్చే  రమ్యమైన కళాఖండం ఈ పర్యావరణం, ఇది సహజ సిద్ధమైనది.
మనం నివసించే ప్రదేశాల్లో చుట్టూ ఉండే ప్రాంతాన్ని, పరిసరాలను దీనిలో వుండే మౌళిక విషియాలను పర్యావరణ అంటారు. పర్యావరణం భూమి, గాలి, అగ్ని, సహజ వాయువుల అన్నింటి మిశ్రమం.
Beautiful environment with clean air and water
Beautiful Environment

మన చుట్టూ వుండే గాలి, నీరు, నేల, మొక్కలు, జంతువులు, వాతావరణం వీటన్నిటి కలిపి పర్యావరణం అంటారు. ఈ సృష్టిలో సమస్త జీవ కోటి ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది. మనకి కావలసినవి సరిగ్గా చూసుకుంటే  మన ప్రకృతి నుండి లభిస్తుంది. ప్రకృతి చాలా అందమైనది, విశాలమైనది, ఆకర్షనీయమైనది. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక  ప్రత్యేకమైన స్థానం వుంది.

పర్యావరణం అసలు ఎందుకు కాలుష్యం అవుతుంది, దీనికి కారణాలు ఏంటి 

పర్యావరణం కాలుష్యం చేయడం లో చాలా శక్తులు కలిసి వున్నాయి.కాలుష్యం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 
  • భూ కాలుష్యం 
  • వాయు కాలుష్యము 
  • నీటి కాలుష్యం
భూ కాలుష్యం

చెత్త, చెదారం, బైట పడివేయడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. దుమ్ము, ధూళి, వ్యర్త పదార్థాలు, మురికి కాలువలు, భూమిలో కలవకుండా వుండే ప్లాస్టిక్ ఈ భూ కాలుష్యానికి తోడ్పడతాయి.

వాయు కాలుష్యము

పర్యావరణంలో వాహనాల నుండి వెలువడే పొగ వలన వాతావరణంలోకి చేరి కాలుష్యంనీ ఏర్పరుస్తున్నాయి. దీని వలన హానికర రసాయనాలు వెలువడుతున్నాయి.

నీటి కాలుష్యము

నీటిలో చేరే వ్యర్థ పదార్దాలు, చెత్త, చెదారం కాలుష్యం చేస్తుంది. నీరు మురికిగా మారడం వలన చాలా రకాల జబ్బులు వస్తాయి.
Water pollution was caused by factory
Water Pollution

ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకుంటాం. 1972, జూన్ 5 న ఐక్యారజ్య సమితి జెనరల్ అసెంబ్లీచే స్థాపించబడింది. 

కాలుష్య కారకాలు

నేడు మానవుడు తన మేథో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరజ్ఞానంతో పెంపొందించుకుని ప్రపంచంలో పరిశ్రమలు వెలువడుతున్నాయి. దీని ద్వారా గాలి, నీరు, తినే ఆహారం అన్ని కాలుష్యం అవుతున్నాయి. అంతే కాక మానవుడు వాహన వేగం పెంచుతూ ఇంధన కొరతకు కారణం అవుతున్నాడు. దీని ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ వంటి విష పూరిత వాయువులు వెలువడి భూమి వెడుక్కుతుంది. జలవనరులు తగ్గిపోతున్నాయి. కాగితం తయారీ కోసం కొన్ని వందల చెట్లు నారుకుతున్నారు. దేశ జనాభా పెరిగి  సౌకర్యాలు తక్కువ అవుతున్నాయి. ఆరోగ్యం కి సంబందించిన సమస్యలు ఏర్పడుతున్నాయి. 

ఉద్యోగం, పరిశ్రమలు కోసం ఇందనాలు వాడడం. బొగ్గు, పెట్రోలియం వాడకం తగ్గుతుంది. మానవుడు లేచిన మొదలు రాత్రి  నిద్రించే వరుకు కాలుష్యంలో బతుకుతున్నాం. 
  • వాహనాల నుండి వెలువడే పొగ 
  • చెట్ల నరికివేత 
  • వ్యర్థాలు, చెత్త  బయిట పడేయడం 
  • నీటి కాలుష్యము 
  • వాయు కాలుష్యము 
  • ప్లాస్టిక్ వాడకం 
  • అపరిశుభ్ర వాతావరణం 
  • పర్యావరణం పచ్చగా లేకపోవడం 

కాలుష్యం నివారణకు తీసుకోవలసిన బాధ్యతలు

మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మన కనీస బాధ్యత. ఇంధన వాడకం తగ్గించాలి. కాలుష్యం కలిగించే వస్తువుల వాడకం తగ్గించాలి. 

ప్లాస్టిక్ వల్ల కాలుష్యం 

ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ భూమిలో కొన్ని వందల సంవత్సరాలు వరుకు విలీనం కావు. దీని వలన జీవ కోటికి ప్రాణనష్టం జరుగుతుంది. పర్యావరణం కాలుష్యం అవుతుంది. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి.

చెట్లు పెంచడం వలన కాలుష్యం నియంత్రణ 
Trees are most useful for environment
చెట్లు 

చెట్లని పెంచాలి. మనం పీల్చే గాలి చెట్ల నుండి వస్తుంది. అదే ప్రాణ వాయువు మనం చేసే పనులు వల్ల కాలుష్యం జరుగుతుంది. దీని వల్ల కొన్ని వందల జీవరాసులు రోజు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. చెట్లని పెంచడం ద్వారా పర్యావరణ పచ్చగా వుండి వర్షాలు పడతాయి.

కాలుష్యం నివారణ వలన జరిగే ఉపయోగాలు


ఇంటి దగ్గర చెట్లు నాటండి. ఇంట్లో వుండే చెత్తని కాల్చవద్దు, చెత్త కుండీలో వేయండి. ప్లాస్టిక్ బాటిల్స్ వాడరాదు. ఇంటి నుండి మంచి నీరు, సంచులను తీసుకుని వెళ్ళండి. ఇంధన వాడకం తగ్గించండి. 

మీకు పనికి రాని వస్తువులను కొనే దుకాణంలో అమ్మండి. పర్యావరణం దినోత్సవం రాగానే చట్టాలు మరింత కటినంగా వుండాలనే వాదనకు వినిపిస్తాయి. ఐతే పర్యావరణం పరిరక్షణకు చట్టాలు ఒకటే సరిపోవు.. పర్యావరణ నీ మన జీవన విలువలలో ఒక భాగంగా చేసుకోవాలి. 

నీటిని పొదుపు చేయడం, రసాయనాలు లేకుండా వ్యవసాయం. ఇంధనాలు నుండి వెలువడే కాలుష్యం తగ్గించాలి. నదులు పునర్జీవింపచేయడం, మొక్కలునీ పెంచడం వ్యర్థాలను ఉత్పత్తి చేయని జీవన విధానాలునీ ప్రారంభించాలి. 

నిజం చెప్పాలంటే మనిషిలో దురాశ కాలుష్యానికి కారణం. సంకటిక అభివృద్ధ, విగ్యానశాస్త్రం అనేది మన అవసరాలకి తీర్చుకోవడానికి, మంచికి ఉపయోగించాలి. కాని పర్యావరణం నాశనంకి ఉపయోగిస్తున్నారు. నిజానికి టెక్నాలజీ అభివృద్ధి కాలుష్యానికి గాని, చెత్తనిగాని సృష్టించవు. 

టెక్నాలజీ మంచికి వాడిన, చెడుకి వాడిన అది మన చేతుల్లోనే వుంది. సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా, సౌర శక్తి  ద్వారా మన సాంకేతిక అభివృద్ధి చేసుకోవాలి. ప్రకృతి వనరులను వాడుకోవడం ద్వారా ప్రజలకి విజ్ఞామ్, సుఖం అందించడం సాంకేతిక ఉద్దేశ్యం, కాని మానవ విలువలు మరిచిపోయినపుడు సుఖానికి బదులుగా, వినాశనానికి, కలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మనం మన పర్యావరణంనీ కాపాడుకుందాం. అది మన చేతుల్లో వుంది. భావి తరాలకు మన ప్రకృతి సంపదని అందిద్దాం.

పచ్చదనాన్ని పెంచుదాం.... పరిశుభ్రంగా ఉంచుదాం.....ఆరోగ్యం గా ఉందాం....


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సౌరకుటుంబంలో భూమి, సూర్యుడు, నక్షత్రాలు మరియు వాతావరణం

భూమి మనం ఈ భూమి మీద కోట్లకు జంతువులు వృక్షజాలం సూక్ష్మ జీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరిగా కాకుండా మనుషులు భూమి మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి పరిసరాలు మార్చుకోవడానికి నిరంతర కృషి చేస్తున్నాం. అన్నిటికీ మించి భూమి మన కార్య కలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమి ఇష్టమొచ్చినట్టు దోచుకునే వనరులు గణిత చేసాం. ఈ లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. భూ వనరులు యాదవ్ దోచుకోవడం వల్ల అడవులు నదులు కొండలు నాశనమయ్యే తోటి జంతువులు తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని, భూగోళం వేడెక్కిపోతుంది మన నేల గాలి నీరు విషపూరితం గా మారుతున్నాయి. భూమి ఎలా పని చేస్తుంది దాని మీద మనం చేస్తున్న పనులు పరస్పర సంబంధం గురించి ఒక కొత్త అవగాహన ఏర్పర్చుకోవాలి సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. సౌరకుటుంబంలో భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవుని

భారతదేశంలో వ్యవసాయ మరియు ఖనిజ పరిశ్రమలు

భారతదేశంలో పరిశ్రమలు పరిశ్రమల స్థాపనకు మౌలిక అవసరాలు దేశ అభివృద్ధిలో పరిశ్రమలది కీలకపాత్ర భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు ప్రత్యేకించి బట్టల తయారీ ప్రధాన పరిశ్రమగా ఉండింది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహాయించి దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత పారిశ్రామిక రంగానికి లేదు. అనేక పారిశ్రామిక వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న మన అవసరాల్లో స్వయంసమృద్ధి సాధించాలన్న ఆశయాలతో కృషిచేశారు. కర్మాగారాలకు యంత్రాలు కావాలి. ఉదాహరణకు బట్టలు తయారు చేసే ఆధునిక పరిశ్రమ కు చేతి మగ్గం కాకుండా విద్యుత్ తో నడిచే మరమగ్గాలు కావాలి. ఈ మరమగ్గాల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ బట్టను ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా సిమెంటు కార్లు వంట నూనె వంటి వాటి ఉత్పత్తికి సంక్లిష్ట యంత్రాలు కావాలి. ఈ యంత్రాలు నడపడానికి ఈ కర్మాగారాలు అన్నింటికి ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్ కావాలి కాబట్టి కర్మాగారాలకు యంత్రాలు వాటి నడపడానికి వ

విటమిన్లు వాటి ఉపయోగాలు

విటమిన్లు వాటి ఉపయోగాలు  విటమిన లను సర్ హెచ్.జి.ఆఫ్ కింగ్స్ అనే శాస్త్రవేత్త 1912లో పాల పై పరిశోధన చేసి దానిలో పెరుగు దల పదార్ధాన్ని గుర్తించి ఈ పదార్థాన్ని సహాయ అదనపు కారకంగా పిలిచాడు. విటమిన్లు అనే పేరు పెట్టిన వ్యక్తి కసిమర్ ఫంక్ విఠల్  అమిన్ పదం నుంచి విటమిన్ల అనే పదం వచ్చింది. విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో  ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ' vitamines ' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని ' vitamins ' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల    నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.  1915లో మెక్కలమ్ విటమిను కొవ్వులో కరిగే నీటిలో కరిగే ఆధారంగా రెండు రకాలుగా గుర్తించాడు. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె  నీటిలో కరిగే విటమిన్లు బి,సి విటమిన్లు సూక్ష్మ పోషకాలు కొవ్వులో కరిగే విటమిన్లు ఎ (A)  విటమిన్