ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డైలీ సైన్స్ అంటే ఏంటి ?

డైలీ సైన్స్ అంటే ఏంటి (What is daily science?) మనం నిత్యం రోజువారి చూసే రసాయనిక మరియు భౌతిక చర్యలనే డైలీ సైన్స్ అంటారు. మన జీవితంలో చాల విషయాలు చూస్తాం కానీ వాటిని పటించుకోము అవి రసాయనిక విజ్గ్యానం కి సంబంధించింది. వాటిలో కొన్ని పాలు, పెరుగుగా మారడం, నీరు మంచు ముక్కలుగా మారడం, కర్పూరం వెలిగించిన తర్వాత అది నేరుగా ఆవిరి రూపం లో మారడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్.  కావున వీటి అన్నింటి వెనుక ఉన్న రసాయన మరియు భౌతిక చర్యల కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ విజ్గ్యానం ఎక్కడ ఎక్కడ ఉపయోగ పడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు మనం అందరి జీవితం లో సైన్స్ దాగి ఉంది.  మన ఇంట్లో జరిగే సైన్స్ (Science in our home) ఉదయం లేవగానే అందరికి అలవాటు టీ  లేదా కాఫీ తాగడం. దాని కోసం మనం పాలు, పంచదార టీ పొడి లేదా కాఫీ పొడి ఉండాలి కానీ ఆలా అన్ని కలుపుకొని సాధారణంగా తాగితే బాగోదు కావున అవి అన్ని కూడా స్టవ్ మీద బాగా  మరిగించి ఫిల్టర్ చేసి కప్ లో పోసుకొని తాగాలి. కావున వీటి అన్నింటి వెనుక మరిగించడం అనేది సైన్స్ ప్రక్రియ.  పాలును, పెరుగుగా మారే విధానం  (Process of turning milk into

కరోనా వైరస్ నివారణ చిట్కాలు మరియు ఎలా వచ్చింది

కరోనా వైరస్ నివారణ చిట్కాలు మరియు ఎలా వచ్చింది

కరోనా,కరోనా ప్రపంచమంతా ఈ పేరుతోనే మారుమోగుతోంది. ఈ కరోనా వైరస్ యొక్క నివారణ మరియు చిట్కాలు ఏంటి అని కావున ఈ వైరస్ నుండి బారిన పడకుండా ఉండడానికి నిమగ్నమై ఉంది.  చైనాలో వెలుగుచూసిన ఈ వైరస్ అక్కడ ఎలా వచ్చింది అని  శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు జపాన్ దక్షిణ కొరియా థాయిలాండ్కు విస్తరించింది. అక్కడితో ఆగకుండా అమెరికా సైతం పాకింది ఇప్పుడు మన భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఈ కరోనా వైరస్ వలన రోజురోజకి మరణాల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. వైరస్ అనేది ఎక్కడో ఉంటె మనకేం అని అనుకోవడానికి అవకాశం లేదు వైరస్ అనేది చాల వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతానికి ఇది స్వల్పంగా ఉన్నా ఎప్పుడూయినా  మహమ్మారిగా పరిణమించే అవకాశం ఉంది అని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
Corona virus looks likes crown
కరోనా వైరస్ 

అసలు ఏమిటి ఈ కరోనా వైరస్ మరియు భారతదేశనికి ఎలా వచ్చింది? 

వైరస్ అనేది లాటిన్ పదం దీనికి విషం అని అర్ధం వీటిని మనం కంటితో చూడలేం. అతి సూక్ష్మమమైయినవి. ఇవి ఇతర జీవ కణాల పై దాడి చేసి వ్యాధికి కారణం అవుతాయి. వాటి సంతతిని పెంచుకుటాయి. వైరస్, బాక్టీరియా సిలిండర్ల కంటే శక్తివంతమైయినవి. జలుబు, ఫ్లూ, మశూచి, చికెన్ పాక్స్, డెంగీ, తాజాగా కరోనా వంటివి వైరస్ వల్లే వ్యాపిస్తుంది.


ప్రపంచ వ్యాప్తంగా 3,20,000 రకాల వైరస్ ఉన్నైయని అంచనా. చార్లెస్ చాంబర్లాOడ్ 19 వ శతాబ్దంలో పోర్స్లీన్ ఫిల్టర్ సహాయంలో మొదటి సారిగా వైరస్ గుర్తించారు. మన శరీరంలో  చాలా వైరస్లు ఉంటాయి. కొన్ని అందులో శరీరంలో ఉన్నప్పటికీ నిద్రాణ స్థితిలో ఉంటాయి. అప్పుడు వాటి సంఖ్య పెరిగి ఆ మనిషి అనారోగ్యానికి గురి అవుతాడు.


కరోనా వైరస్ పుట్టుక ఎలా జరిగింది 

కరోనా వైరస్ అనేది పాములు, వన్యప్రాణులు, గబ్బిలాల నుండి ఈ వైరస్ మనుషులకి వ్యాప్తి చెంది ఉంటుందని పరిశోదుకులు భావిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 2019, మధ్య కాలంలో కరోనా వైరస్ మొదటి కేసు నమోదు అయ్యంది. పాములోనే కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.

People wearing mask to prevent virus
మాస్క్ ధరించటం 

1960లో దీనిని మొట్టమొదటి  సారిగా కనుక్కున్నారు. కిరీటాల ఆకారంలో ఈ వైరస్ ఉండడం వలన దీనికి కరోనా వైరస్ అనే పేరు వచ్చింది. 2003 లో ఈ వైరస్ తొలిసారిగా జనాల ముందుకు రాక్షస రూపంలో వచ్చింది 774 మందిని బలితీసుకుంది అయినప్పటికీ దీనికి వాక్సిన్ కినిపెట్టి శాశ్వతంగా తరిమి కొట్టరు.

హమ్మయ్య! అని అనుకొనే లోపు 2014 లో మళ్ళీ వచ్చింది 858 మందిని బాలితీసుకుంది. మళ్ళీ వాక్సిన్ కనిపెట్టి తరిమికొట్టారు. కాని మళ్ళీ 2019 డిసెంబర్లో మళ్ళీ రాక్షస రూపం దాల్చి జనాలపై విరుచుకుపడుతుంది.

ఈ వైరస్ పూర్తి పేరు 2019 నొవల్ కరోనా వైరస్ గా పేరు పెట్టేరు. కరోనా వైరస్ జంతువులలో ఎక్కువగా, మనుషులలో తక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు SARS, MERS AND 2019-NCOV అతి ప్రమాదకరంగా ఉన్నాయి

కరోనా వైరస్ లక్షణాలు
  • ముక్కు కారటం
  •  తుమ్ములు
  • జ్వరం
  •  ఒళ్ళు  నొప్పులు
  •  గొంతు నొప్పి
  • తలనొప్పి
  •  చలి
  •  గుండె వేగంగా కొట్టుకోవడం
  •  పొడిదగ్గు
  • స్వల్పంగా ఆయాసం
  •  జీర్ణకోశ సమస్యలు
  • విరోచనాలు
  • నిమోనియా
  • మూత్రపిండాల వైఫల్యం
ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుండి మరొకరికి సోకుతాయి. ఇవి నోరు, ముక్కు, కళ్ళ వంటి అవయవాల మీద పొరల మీద ఇన్ఫెక్షన్ వస్తుంది.

తుంపర్లు పడిన వస్తువులను ముట్టుకొని, అవే చేతులతో నోరు, ముక్కు, కళ్ళను రుద్దుకున్నా వైరస్ వంటిలోకి ప్రవేశిస్తుంది. జన సాంద్రత ఎక్కువగా గల స్థలంలో కిక్కిరిసిన ఆవాసాల్లో వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుంది.


పోషణ లోపం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వైరస్ త్వరగా సోకుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా గల పిల్లలు, వృద్దులు లలో ముప్పు ఎక్కువ.


చైనాలో వుహాన్ నగరంలో కరోనా పుట్టుక ఎలా జరిగింది 

ఇప్పటి వరకు ఎక్కువ ప్రాణనష్టం జరిగిన వుహాన్ నగరంలో పరిస్థితి దయనీయంగా మారుతుంది. వాక్సిన్ తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి వన్యప్రాణం ల పెంపకం, రవాణా, విక్రయాలపై చైనా నిషేధం ఉంటుంది అని తెల్పింది.

చైనాలో 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి వైద్య సేవలు ప్రారంభించారు. అవసరం, ఆలోచన, ఆధునిక విగ్యానమ్, ఎలాంటి అసాధ్యనైనా సుసాధ్యం చేస్తుంది అవడానికి ఇదే పెద్ద ఉదహరణ. 7000 మంది మనుషులతో 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని కట్టారు.


చైనాలో కొంతమంది తెలుగు ఇంజినీర్లు చిక్కుకున్నారు వారిని తీసుకొచ్చే ఏర్పాటులో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కరోనా వ్యాప్తిని ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించిన డబ్ల్యూ హెచ్ ఓ WHO

ప్రణాళిక ప్రకారం 2 ఆసుపత్రులు కడతారు ఒకటి పూర్తి అయింది రెండవది 1600 పడకలతో మరో భవణ నిర్మాణం జరుగుతుంది. మెడికల్, రోబోలు, అధునాతన సౌకర్యాలను కలిగించి వైద్య సేవలు అందిస్తున్నారు.

నిం గ్రానైట్ పరిశ్రమకు కరోనా వల్ల నష్టం జరుగుతుంది ఎగుమతి దిగుమతి ఆగిపోయాయి. సుమారుగా 3000 మంది ప్రపంచం వ్యాప్తంగా మరణాలు సంభవించాయి. చైనాలో హుబెయ్ ప్రావిన్సులోని 24 గంటలలో 64 మంది చనిపోవడం ఎంత తీవ్రతగా వైరస్ ఉందో తెలుస్తుంది

మన దేశంలో తొలి కేసు కేరళలో నమోదు అయ్యింది.

ప్రపంచం పై కరోనా వైరస్ ప్రభావం 

కరోనా వైరస్ ప్రపంచం లో 200 దేశాలు పైగా వ్యాప్తి చెందింది ప్రస్తుతానికి ఈ వైరస్ వల్ల ఒక లక్ష ఇరవై అయదు వేల (1,25000) మంది మరణాలు సంభవించాయి మరియు ఈ వైరస్ బారిన పుదీనా వాళ్ళు ఇరవై మూడు లక్షల (23,00,000) మంది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, చైనా మరియు యూరోపియన్ దేశాలలో ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ గా ఉంది.

కరోనా వైరస్ ప్రపంచంలో చాలా దేశాలలో భయానకంగా వ్యాపించింది ఆ దేశాలు యొక్క ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండడం వల్ల అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భారత్ వంటి దేశాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వాళ్ళ ఇక్కడ మన దేశంలో చాల తక్కువగా ఉంది అని భావిస్తున్నారు. అంటే వేసవి కలం లో మన దేశం యొక్క ఉష్ణోగ్రత చాల ఎక్కువగా ఉంటుంది. కావున మనకు కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది

కరోనా వైరస్  నివారణ చిట్కాలు 

Hand wash with soap to prevent corona virus
చేతులు సబ్బుతో కడగడం 
  •  తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ముక్కుకు, నోటికి, రుమాలు అడ్డం పెట్టుకోవాలి.
  • జలుబు, ఫ్లూ లక్షణాలు గల వారికి దూరంగా ఉండడం మేలు. 
  • తరచూ చేతులు కడుకోవాలి. 
  • వంట పని ముందు తరవాత, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుకోవాలి. 
  • జనసమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. 
  • జంతువులను చేతికి ముక్కుకు రక్షణ లేకుండా తాకరాదు. 
  • మాంసాహారం తినేవారు బాగా ఉడికిన తరవాత మాంసం గుడ్లు తినాలి. 
  • జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. 
  • లక్షణాలు బట్టి జ్వరం నొప్పులు తగ్గడానికి పారసిటమాల్ మాత్రలు ఉపయోగపడతాయి.
చైనా నుండి వచ్చిన రాష్ట్ర వాసులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. శీతలీకరణ మాంసం తినొద్దు అని, కరచాలనం చేయకూడదు అని దిల్లీ ప్రభుత్వం తెలిపింది. విమానంలో ప్రయాణించే వారు ముందుగా ముఖానికి అడ్డంగా ఉన్న మాస్కు స్వీకరించాలి.


వైద్య పరీక్షలు చేయిచుకోవాలి, పక్క వారితో సన్నిహితంగా మెలగద్దు. ప్రపంచంలో 26 దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. మన దేశంలో కూడా కేరళలో మొదటి కేసు నమోదు అయ్యింది. కాబట్టి ఎలాంటి సమయంలోనైనా మన భారతదేశానికి వ్యాపించే అవకాశం ఉంది.


కాబట్టి ఈ వ్యాధికి ఇంకా మందుని కనిపెట్టలేదు దీనికి నివారణ ఒక్కటే మార్గం.మనకి మన చుట్టూ ఉండే వాళ్ళకి రాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి గురించి తెలియని వాళ్ళకి చెప్పి ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి బయట పడదాం.


COVID-19 అంటే ఏమిటి?

COVID-19 అని నామకర్ణం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్ధ WHO. దీని అర్థం

CO-కారొనా  VI-వైరస్, D- డిసీస్ (వ్యాధి), 19- 2019.

ఇప్పుడు ప్రపంచ అంతా ఈ వైరస్ నీ నోవెల్ కరోనా లేదా కోవిద్ 19 అని పిలుస్తుంది.

మన దేశంలో కరోనా ప్రభావం 

మన దేశ ప్రియతమా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు ఈ కరోనా వ్యాప్తి కారణంగా ఈ నెల అంటే మార్చ్ 22న ఆదివారం 2020, దేశం అంతా కూడా ఒక్క రోజు కర్ఫ్యూ నీ అమలు చేసేరు. విజయవంతం అయంది.


కని కరోనా వ్యాప్తి నీ బాగా తెలుసుకున్న మన ప్రధాని మంత్రి గారు 21 రోజుల లాక్ డౌన్ నీ ఆదేశం ఇచ్చారు...


కరోనా ప్రపంచం లో వేల మందిని బలి తీసుకుంటోంది. వీళ్ళ లో డాక్టర్, వైద్య వైబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చే కొత్త ప్రశ్న ఏంటి అంటే ఈ కరోనా వైరస్ ఎలా మనుషులకు సోకుతుంది.ఇతర రోగ లక్షణాలు మధ్య పోలికలను, తేడాలను గమనించిన తర్వాత నిపుణుల అంచనా ఒక్కటే. కొత్తగా వచ్చిన వైరస్ కు, ఆ వ్యక్తి వ్యాధి నిరోధక శక్తి కి మద్య జరిగే పోరాటానికి సంకేతం .జలుబు..ప్రతి కేస్ లో కరోనా వైరస్ బాడీ సెల్స్ ను చంపేస్తుంది.వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నపుడు ప్రభావం తక్కువగా ఉండటం.అదే వయస్సు ఎక్కువగా ఉన్నవారికి అందులోనే వారికి మధు మేహం, గుండె సంబంధిత రోగాలు ఉన్నపుడు కరోనా ప్రమాదకరం గా మారుతుంది.


ఒక నివేదిక ప్రకారం 50 ఏళ్లు దాటిన మగవారిని ఈ కరోనా వైరస్ బలితీసుకుంటుంది .ఎపుడైనా వైరస్ వచ్చిన వెంటెనే వ్యాధి నిరోధక శక్తి బాడీ లోని వ్యాధి నిరోధక శక్తి ఎదురు దాడి మొదలు పెడుతుంది.ఒకసారి వ్యాధి నిరోధక శక్తి బలహీనపడిన వెంటనే వైరస్ చెలరేగి పడుతుంది.
కరోనా బాధితుడు దగ్గిన, తుమ్మినా, వైరస్ గాల్లోకి చేరుతుంది.ఒకవేళ బాధితుడు ఎదుటివారు ముఖం మీద తుమ్మితే మరింత ప్రమాదం .అతనికి సోకే అవకాశాలు తక్కువ వుంటాయి.తెలియక కరోనా బాధితుడు నీ తాకిన, వాళ్ళ నోరు ముక్కు ద్వారా ఎదుటి వారి శరీరం లో కి ప్రవేశిస్తుంది.

చైనా లో కొత్తగా పుట్టుొచ్చిన వైరస్ .శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపే ఈ వైరస్ ను 1960 లో తొలిసారిగా కనుక్కున్నారు.పక్షులు, క్షిరధాల్లో ఈ వైరస్ ఎక్కువగా వుంటుంది .ఈ వైరస్ ఊహన్ లో ఓ సముద్రపు ఆహార ఉత్పత్తి లలో మార్కెట్ లలో కొత్త వైరస్ వచ్చునట్లు అధికారులు గుర్తించారు.వైరస్ వల్ల ఊహాన్ లో 2 మృతి చెందడం తో ఈ  సాంపుల్స్ నీ లండన్ కి పంపించి పరిశోధనలు నిర్వ హించారు. పరిశోధనల్లో కరోనా గా నిర్వహించారు.ఈ వ్యాధికి టీకాలు...తప్ప వాక్సిన్ లేదు.. దీని మొదటి కేసు..డిసెంబర్ 1 2019 న వచ్చింది.

కరోనా వైరస్ చాలా సాధారణం గా వుంటుంది.శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలలో దీనిని గుర్తించవచ్చు .

కరోనా వైరస్ అను పేరు గల వైరస్ కలిగించే జబ్బు పేరు కోవిడ్ 19. కరోనా వైరస్ జబ్బు లక్షణాలను 1 నుండి 14 రోజులు.. పడుతుంది. సాధారణం గా..5 రోజుల్లో  బయిట పడుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియ చేస్తుంది.

ఇవి ఎక్కువ పక్షులు , క్షీరదాలు పై ప్రభావాన్ని చూపిస్తాయి.కొత్తగా వచ్చిన కరోనా వైరస్ మనుషు ల పై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది.
చైనా లో 2020 మార్చి 5 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 95000 కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.చైనా , ఇటలీ లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. 3200 మందికి పైగా మరణించారు

వేసవి కలంలో కరోనా వైరస్ విజృంభణ తక్కువగా ఉంటుంది అని ప్రపంచ వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్ యొక్క నివారణ చిట్కాలు ఇంకా చాల రకాలు ఉన్నాయ్. వైద్యులు చెప్పే నివారణ మార్గాలు తెలుసుకొని పాటించాలి. మన ఆరోగ్యం కాపాడుకోవాలి. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రోడ్డు భద్రత విద్య

రోడ్డు భద్రత విద్య ( Road safety education)   రవాణా రంగం ( Transport sector) చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా పారిశ్రామీకరణ, నగరీకరణ, ప్రపంచీకరణ వల్ల వాహనాలు రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభం అయ్యింది. ఒక క్రమబద్ధీకరణ అనగా రోడ్డును ఉపయోగించే వారు అందరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించడమే. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం రోడ్డు ఉపయోగించే ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు రవాణా సాధనాలు ( Means of road transport) ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు అని అంటారు. బస్సులో మెషిన్ ద్వారా టికెట్ ను ఇస్తున్నారు దీనిని టికెట్ ఇష్యూ యింగ్ మెషీన్ అంటారు. టి ఐ ఎన్ ఎస్ లో టికెట్ నుంచి పంచ్ చేసే ఇబ్బంది ఉండదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే బస్సు సర్వీసులు తెలుగు వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, గరుడ, లగ్జరీ, ఇంద్ర. బస్సు టికెట్ ను ముందుగా రిజర్వు చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వనిత, నవ్య కార్డు గల వారికి ప్రయాణం ధరలో 10 శాతం రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది. టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం అందుకు

ప్లాస్టిక్ వాడకం- పర్యావరణ కాలుష్యం ఏర్పడడం

మన పర్యావరణంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే కాలుష్యం   ప్లాస్టిక్ ఎక్కడ చూసినా అందరి నోట ఇదే మాట. ప్లాస్టిక్ దీని వల్ల మనకి వచ్చే సమస్యలు ఏంటి అనేది తేలుసుకోవలసిన అవసరం చాలా వుంది. ప్లాస్టిక్ మన జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మనం అందరం ప్లాస్టిక్ ఉపయోగించి చాలా సుఖపడ్డాం కాని, ఆ సుఖం వెనుక, మన ప్రాణాలు తీసే మహమ్మారి వుంది. ప్రకృతినీ నాశనం చేసే, కాలుష్యం వుంది. ప్లాస్టిక్ బొట్టేళ్ళు మరియు కవర్లు  ప్లాస్టిక్ పుట్టుక ఎప్పుడు జరిగింది  ప్లాస్టిక్ ఆవిర్భావం 1839లో జరిగింది. పర్యావణానికిి ప్లాస్టిక్ పెను ప్రమాదం. ప్లాస్టిక్ పాలిమర్ మరియు మొనోమర్లు యూనిట్ లని కలిగి వుండే పెద్ద అణువులు. ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే పదార్థ అణువులో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలలో తయారయ్యే పదార్థం. ప్లాస్టిక్ తయారీలో వాడే మూల పదార్థం ముడి చమురు. ప్లాస్టిక్  ఉత్పత్తి ఎలా జరుగును  ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణం ప్రపంచ శ్రేష్టమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు 7 మ

రకరకాల చెట్లు మరియు వాటి ప్రయోజనాలు

రకరకాల చెట్లు మరియు వాటి ప్రయోజనాలు వేప చెట్టు అత్యుత్తమ ఔశధ గుణాలున్న చెట్ల లో ఒకటి.ఈ విషయం అనాది కాలం నుండి భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు.గరుత్మంతుడు అమృతభాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకం లో వేప మీద పడగా అది శక్తివంతంగా మానవులకి మేలు చేసే వృక్షము గా మారింది అనేది పురాణ గాధ.ఇది చాలా ఔషధ గుణాలు కలది.వేప ఆకులను అయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంటు వ్యాధులను తొలగిస్తుంది.ఉగాది పచ్చడి లో వేస్తారు. మర్రి చెట్టు పురాతనంగా పూజలు అందుకంటున్న చెట్టు మర్రి.దీనిని భారతదేశం లో త్రిమూర్తుల వృక్షము గా కొలుస్తారు. సంతానాన్ని ,సంపదను మర్రి చెట్టు అందిస్తుందనేది హైందవ విశ్వాసం.మన పురాణాల్లో ప్రస్తావించిన కల్ప వృక్షం మర్రి చెట్టు.చిరకాలం జీవించే మర్రి చెట్టు మానవ జీవితానికి మేలు చేస్తుంది. ఈ చెట్టు వేర్లు బయటకి కనిపిస్తూ వుంటాయి.ఈ చెట్టు దృఢంగా పెద్ద పెద్ద ఉడల తో వుంటుంది.ఈ ఊడల సహాయం తో చెట్టు విస్తరిస్తుంది. ఇది పెద్ద పెద్ద కొమ్మలు ఆకులతో విస్తరించి వుండడం వల్ల చాలా మేర అవరించి చల్లని నిడని ఇస్తుంది.మర్రి అకుని పూజల్లో పెట్టి కొలుస్త